వారం వారం తెవికీ వ్యాసాలు.

Sunday, November 30, 2008

చికాగో: ఈ వారం తెవికీ వ్యాసం

చికాగో అమెరికాలోని ఇల్లనోయ్ రాష్టంలో ఒక నగరం. అమెరికాలో 3వ అతిపెద్ద నగరం. ఇల్లనోయ్, విస్‌కాన్‌సిన్ మరియు ఇండియానా లతో కలిపి చికాగో నగరపాలిత ప్రాంత జనాభా 9.7 మిలియన్లు. అంతర్జాతీయంగా చికాగోకు కల ప్రాముఖ్యత, ఈ నగరాన్ని అల్ఫా వరల్డ్ సిటీ జాబితాలోకి చేర్చింది. 1837 నుండి చికాగో నగరాల జాబితాలోకి చేరింది. మిసిసీపీ నది తీరాన ఉండటం వలన వ్యాపారానికి అనువైన జలమార్గాలు, సరస్సులు మొదలైన నీటి వనరులు చికాగోను అతి త్వరిత గతిని అభివృద్ధి పధానికి నడిపాయి. మిడ్‌వెస్ట్ (మద్య పశ్చిమ ప్రాంతం)కు ప్రస్తుతం చికాగో రవాణాకు, ఆర్ధిక రంగానికి మరియు సాంస్కృతికంగా ప్రముఖ కేంద్రం.

చికాగో ఆర్ధికాభివృద్ధి మిచిగాన్ సరసుతో ముడిపడి ఉంటుంది. చికాగో నగర జలరవాణా ఎక్కువగా చికాగో నదిపై జరుగుతున్న కాలంలో,ఇప్పటి పెద్దసంస్థ అయిన లేక్ ఫ్రైటర్స్ మాత్రం నగరానికి దక్షిణ తీరంలో ఉన్న లేక్ కల్మెట్ హార్బర్‌ ని వాడుకుంటూ వచ్చింది. సరసు కారణంగా చికాగో వాతావరణం అనుకూలంగా కొంత హాయిని కొల్పేదిగా ఉంటుంది. చికాగో నగరం ఎదుర్కొన్న భయంకర అగ్ని ప్రమాదం నగరంలో అత్యంత అధునాతన భవన నిర్మాణ విప్లవవానికి నాంది పలికింది. చరిత్ర జ్ఞాపకాలలో చెరగని ముద్ర వేసిన ఈ అగ్ని ప్రమాదం దేశం గర్వించదగిన భవనాలు ఈ నగరంలో రూపుదిద్దుకోవడానికి దోహదమైంది.

చికాగో నగరం విధ విధమైన వంటకాలకు ప్రసిద్ది. ఇక్కడ స్థిరపడిన ప్రజల విభిన్న జాతీయతే ఇందుకు కారణం. చికాగోలో దేశమంతా ప్రబలమైన డీప్ డిష్ పీజా ఎంత ప్రసిద్దమో చికాగో నగర ప్రత్యేకమైన తిన్‌క్రస్ట్ పీజా కూడా అంత ప్రసిద్దమే. ప్రపంచంలో ధనిక నగరాలలో చికాగో 10 వ స్థానంలో ఉంది. వాణిజ్య కేంద్రాలలో ప్రంచంలో చికాగో 4 వ స్థానంలో ఉంది.

... పూర్తి వ్యాసం

Sunday, November 23, 2008

అంజు బాబీ జార్జ్: ఈ వారం తెవికీ వ్యాసం

అంజు బాబీ జార్జ్ ప్రముఖ అథ్లెటిక్ క్రీడాకారిణి. ఆమె ప్రతిభకు గుర్తింపుగా భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. భారతదేశంలో అత్యున్నతమైన క్రీడా పురస్కారాలలో ఒకటైన రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు కూడా ఆమెకు బహుకరించారు. అంజు 1977, ఏప్రిల్ 19న కేరళలోని చంగనాస్సరిలో కోచిపరాంబిల్ కుటుంబంలో జన్మించింది. అంజు తండ్రి ప్రోత్సాహం మరియు పాఠశాల శిక్షకుడు తోడ్పాటుతో అథ్లెటిక్ రంగంలోకి ప్రవేశించింది. ఆమె హెప్టాథ్లాన్‌లో క్రీడాజీవితం ప్రారంభించినా ఆ తర్వాత లాంగ్‌జంప్, హైజంప్‌లపై శ్రద్ధ చూపించి 1996లో ఢిల్లీ లో జూనియన్ ఆసియన్ ఛాంపియన్‌షిప్‌లో లాంగ్‌జంప్‌లో స్వర్ణపతకం సాధించింది. 1999లో బెంగుళూరులో ట్రిపుల్‌జంప్‌లో జాతీయ రికార్డు సృష్టించింది. నేపాల్‌లో రజత పతకం సాధించింది. 2001లో లుధియానాలో జరిగిన జాతీయ క్రీడలలో ట్రిపుల్‌జంప్‌లో స్వర్ణం సాధించింది. 2002లో మాంచెస్టర్‌లో జరిగిన కామన్వెల్త్ క్రీడలలో అంజు 6.49 మీటర్లు లాంగ్‌జంప్ కాంస్యపతకం గెల్చింది. ఆ తర్వాత బుసాన్లో జరిగిన ఆసియా క్రీడలలో భారతదేశానికి స్వర్ణ పతకం సాధించి పెట్టింది.


2003లో పారిస్‌లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్ పోటీలలో 6.70 మీటర్ల దూరం దుమికి కాంస్య పతకం సాధించి దేశ అథ్లెటిక్ చరిత్రలోనే చరిత్ర సృష్టించింది. ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్ పోటీలలో పతకం గెల్చిన తొలి భారతీయ వ్యక్తిగా రికార్డు సృష్టించింది. 2005లో దక్షిణ కొరియాలో 16వ ఆసియా అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్ పోటీలలో 6.65 మీటర్ల దూరంతో బంగారుపతకం గెల్చింది. అదే సంవత్సరం ఐ.ఎ.ఎ.ఎఫ్ ప్రపంచ అథ్లెటిక్స్‌లో 6.75 మీటర్లు దుమికి రజిత పతకం సాధించింది. ఇదే ఆమె ఆఖరి అత్యున్నత ప్రతిభ. 2006లో దోహలో జరిగిన 15వ ఆసియా క్రీడలలో లాంగ్‌జంప్‌లో రజత పతకం సాధించింది. 2008లో దోహాలో ప్రపంచ ఇండోర్ అథ్లెటిక్ పోటీలలో రజతపతకం సాధించింది. అంజు జార్జి భర్త, బాబీ జార్జ్ కూడా క్రీడాకారుడే. మెకానికల్ ఇంజనీర్ అయిన అతడు ట్రిపుల్ జంప్‌లో జాతీయ క్రీడల చాంపియన్. అంజుకు క్రీడలలో ప్రాత్సాహమే కాకుండా మంచి శిక్షణ కూడా ఇచ్చాడు. 1998 నుంచి అంజుకు పూర్తి కాలపు కోచ్‌గా వ్యవహరించాడు.

 ప్రముఖ అథ్లెటిక్ క్రీడాకారిణి. ఆమె ప్రతిభకు గుర్తింపుగా భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. భారతదేశంలో అత్యున్నతమైన క్రీడా పురస్కారాలలో ఒకటైన రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు కూడా ఆమెకు బహుకరించారు. అంజు 1977, ఏప్రిల్ 19న కేరళలోని చంగనాస్సరిలో కోచిపరాంబిల్ కుటుంబంలో జన్మించింది. అంజు తండ్రి ప్రోత్సాహం మరియు పాఠశాల శిక్షకుడు తోడ్పాటుతో అథ్లెటిక్ రంగంలోకి ప్రవేశించింది. ఆమె హెప్టాథ్లాన్‌లో క్రీడాజీవితం ప్రారంభించినా ఆ తర్వాత లాంగ్‌జంప్, హైజంప్‌లపై శ్రద్ధ చూపించి 1996లో ఢిల్లీ లో జూనియన్ ఆసియన్ ఛాంపియన్‌షిప్‌లో లాంగ్‌జంప్‌లో స్వర్ణపతకం సాధించింది. 1999లో బెంగుళూరులో ట్రిపుల్‌జంప్‌లో జాతీయ రికార్డు సృష్టించింది. నేపాల్‌లో రజత పతకం సాధించింది. 2001లో లుధియానాలో జరిగిన జాతీయ క్రీడలలో ట్రిపుల్‌జంప్‌లో స్వర్ణం సాధించింది. 2002లో మాంచెస్టర్‌లో జరిగిన కామన్వెల్త్ క్రీడలలో అంజు 6.49 మీటర్లు లాంగ్‌జంప్ కాంస్యపతకం గెల్చింది. ఆ తర్వాత బుసాన్లో జరిగిన ఆసియా క్రీడలలో భారతదేశానికి స్వర్ణ పతకం సాధించి పెట్టింది.


2003లో పారిస్‌లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్ పోటీలలో 6.70 మీటర్ల దూరం దుమికి కాంస్య పతకం సాధించి దేశ అథ్లెటిక్ చరిత్రలోనే చరిత్ర సృష్టించింది. ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్ పోటీలలో పతకం గెల్చిన తొలి భారతీయ వ్యక్తిగా రికార్డు సృష్టించింది. 2005లో దక్షిణ కొరియాలో 16వ ఆసియా అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్ పోటీలలో 6.65 మీటర్ల దూరంతో బంగారుపతకం గెల్చింది. అదే సంవత్సరం ఐ.ఎ.ఎ.ఎఫ్ ప్రపంచ అథ్లెటిక్స్‌లో 6.75 మీటర్లు దుమికి రజిత పతకం సాధించింది. ఇదే ఆమె ఆఖరి అత్యున్నత ప్రతిభ. 2006లో దోహలో జరిగిన 15వ ఆసియా క్రీడలలో లాంగ్‌జంప్‌లో రజత పతకం సాధించింది. 2008లో దోహాలో ప్రపంచ ఇండోర్ అథ్లెటిక్ పోటీలలో రజతపతకం సాధించింది. అంజు జార్జి భర్త, బాబీ జార్జ్ కూడా క్రీడాకారుడే. మెకానికల్ ఇంజనీర్ అయిన అతడు ట్రిపుల్ జంప్‌లో జాతీయ క్రీడల చాంపియన్. అంజుకు క్రీడలలో ప్రాత్సాహమే కాకుండా మంచి శిక్షణ కూడా ఇచ్చాడు. 1998 నుంచి అంజుకు పూర్తి కాలపు కోచ్‌గా వ్యవహరించాడు.

... పూర్తి వ్యాసం

Sunday, November 16, 2008

మొసలి: ఈ వారం తెవికీ వ్యాసం

మొసలి సరీసృపాల జాతికి చెందిన ఒక జంతువు. ఇది "క్రోకడైలిడే" అనబడే కుటుంబానికి చెందినది. స్థూలంగా దీనిని క్రోకడీలియా అనే క్రమంలో వర్గీకరస్తారు. crocodiles, alligators, caimans, gharial అనే జంతువులు ఈ "క్రోకడీలియా" అనే క్రమంలోకే చెందుతాయి. మొసళ్ళు ఆఫ్రికా, ఆసియా, అమెరికా, ఆస్ట్రేలియా ఖండాలలో ఉష్ణమండలపు తేమ ప్రాంతాలలో ఉండే పెద్ద జలచరాలుగా జీవించే సరీసృపాలు. అధికంగా ఇవి సరస్సులు, నదులు వంటి మంచి నీటి స్థలాలలోను, అరుదుగా ఉప్పునీటి కయ్యలలోను ఉంటుంటాయి. మొసళ్ళు భూమిమీద 200 మిలియన్ సంవత్సరాల క్రితంనుండి ఉన్నాయని అంచనా. భూమి మీద మరెన్నో జాతులు అంతరించినప్పటికీ మొసళ్ళ జాతి నిలబడింది. బ్రతికి ఉన్న మొసళ్ళలో అతి పెద్దది ఒరిస్సాలో "భైతర్కనికా వన్యప్రాణి సంరక్షణావనంలో ఉంది. దీని పొడవు 7.1 మిటర్లు (25.3 అడుగులు). ఇది జూన్ 2006లో గిన్నీస్ బుక్‌లోకి ఎక్కింది.


కొద్ది దూరాల ప్రయాణంలో మొసళ్ళు వేగంగానే కదలగలవు. వాటి దవడలు చాలా శక్తివంతమైనవి. వాటి నోటికి అందిన జంతువులను పటపట విరిచేసే శక్తి ఈ దవడల ద్వారా వాటికి లభిస్తుంది. అన్ని జంతువుల కంటే మొసళ్ళ దవడల బలం చాలా ఎక్కువ. దాని నోటిపట్టు చదరపు అంగుళానికి 5,000 పౌండుల బలాన్ని కలిగిస్తుంది. మొసళ్ళ పళ్ళు చాలా పదునైన రంపాలలాగా ఉంటాయి. చేపలను ముక్కలు ముక్కలుగా చేయడానికి వీలైనవి. పరిణామ క్రమంలో వేటను ఇంత బలంగా పట్టుకోవడానికి రూపొందిన మొసళ్ళ దవడ కండరాలకు నోటిని తెరిచేప్పుడు లభించే శక్తి మాత్రం చాలా తక్కువ. వాటి నోరు గట్టిగా మూసి పట్టుకొంటే అవి నోరు తెరువలేవు.


పెద్ద జాతి మొసళ్ళు మనుషులకు చాలా ప్రమాదకరమైనవి. వాటి "నడక" వేగం కంటే మెరుపులా మీదపడే లక్షణం వల్ల మనుషులకు తప్పించుకొనే అవకాశం చాలా తక్కువ. వీటిలో ఉప్పు నీటి మొసలి మరియు నైల్ మొసలి యేటా ఆఫ్రికా, ఆగ్నేయాసియాలలో వందలాది మనుషుల మరణాలకు కారణమవుతున్నాయి. మగ్గర్ మొసలి మరియు నల్ల కెయ్‌మన్ కూడా చాలా ప్రమాదకరమైనవి. అమెరికన్ ఎలిగేటర్ అంత ప్రమాదకరమైనది కాదు. రెచ్చగొడితే తప్ప తనంత తనుగా ఇది మనుషులపై దాడి చేయదు.

... పూర్తి వ్యాసం

Friday, November 14, 2008

అబ్‌ఖజియా: ఈ వారం తెవికీ వ్యాసం

అబ్‌ఖజియా కాకస్ పర్వతాల ప్రాంతంలో ఉన్న ఒక భూభాగం. ఇది దాదాపు పూర్తి స్వాతంత్ర్యం కలిగిన గణతంత్ర దేశం. కాని అంతర్జాతీయంగా దీనికి దేశంగా గుర్తింపులేదు. ఒక్క జార్జియా దేశం మాత్రం అబ్‌ఖజియాను గుర్తించింది. అబ్‌ఖజియా దేశం పూర్తిగా జార్జియా సరిహద్దుల లోపల ఉన్నది. పశ్చిమాన నల్ల సముద్రం, ఉత్తరాన రష్యా అబ్‌ఖజియాకు సరిహద్దులు. ప్రపంచంలోని ఏ ఇతర దేశాలు అబ్‌ఖజియాను స్వతంత్ర దేశంగా గుర్తించలేదు.


1992-1993 మధ్యకాలంలో జార్జియా నుండి జరిగిన వేర్పాటు ఉద్యమంలో జార్జియా మిలిటరీ ఓడిపోయింది. అబ్‌ఖజియా ప్రాంతంనుండి ఇతర జాతులవాళ్ళు వెళ్ళగొట్టబడ్డారు. 1994లో యుద్ధవిరమణ జరిగింది. అయినా ఇప్పటికీ వివాదం పరిష్కారమవలేదు. రష్యా అండ ఉన్న వేర్పాటువాదులు మొత్తం భూభాగంలో 83%పై అధిపత్యం కలిగిఉన్నారు (de-facto Government). మిగిలిన 17% భూభాగంపై అధిపత్యం కలిగి ఉన్న పార్టీలు 'కొడోరి లోయ'నుండి తమ పాలన సాగిస్తున్నారు. ఈ (17% పాలన) సముదాయానికే అబ్‌ఖజియాలో న్యాయపరమైన పాలకులుగా గుర్తింపు ఉన్నది. (de-jure Government). ఐక్య రాజ్య సమితి, యూరోపియన్ కమ్యూనిటీ వంటి అంతర్జాతీయ సంస్థలు అబ్‌ఖజియాను జార్జియా దేశంలో ఒక అంతర్గత భాగంగా మాత్రమే గుర్తిస్తున్నాయి. జార్జియా, అబ్‌ఖజియాలు తమ మధ్య వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకొని తమ స్థితిని స్పష్టం చేయాలని ఐ.రా.స. కోరుతున్నది.


మొత్తం 8,600 చ.కి.మీ. వైశాల్యం గల అబ్‌ఖజియా దేశం ప్రధానంగా పర్వతమయమైనది. కాకస్ పర్వతాలలో విస్తరించి ఉన్నది. చాలా పర్వత శిఖరాలు 4,000 మీటర్లు పైబడి ఎత్తు గలవి. నల్ల సముద్రం తీరాన మైదాన ప్రాంతాలనుండి ఉత్తరాన శాశ్వత హిమమయమైన లోయలవరకు వైవిధ్యం గల భౌగోళిక స్వరూపం ఉన్నది. మైదాన ప్రాంతాలలో సాగు అయ్యే తేయాకు, పొగాకు, ద్రాక్ష, ఇతర పండ్ల తోటలు అబ్‌ఖజియా ఆర్ధిక వ్యవస్థకు పట్టుకొమ్మలు. కాకస్ పర్వతాలనుండి సముద్రంలోకి ప్రవహించే చిన్న చిన్న నదులు వ్యవసాయానికి ప్రధానమైన నీటివనరులు. అబ్‌ఖజియా ఆర్ధిక వ్యవస్థ రష్యాతో గాఢంగా ముడిపడి ఉంది.

...పూర్తి వ్యాసం

Sunday, November 2, 2008

అమరావతి స్తూపము: ఈ వారం తెవికీ వ్యాసం

అమరావతి, గుంటూరు జిల్లాలో కృష్ణా నదీ తీరాన ఉన్నది. అమరావతికి సమీపంలోని ధరణికోట ఒకప్పటి ఆంధ్ర శాతవాహనుల రాజధానియైన ధాన్యకటకం. ఆ కాలంలో బౌద్ధ మతం పరిఢవిల్లింది. అప్పటి అమరావతి స్తూపము ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. ఈ స్తూపము క్రీస్తు పూర్వము 2వ శతాబ్దము, క్రీస్తు శకము 3వ శతాబ్దముల మధ్య కట్టబడి మార్పులు చేర్పులు చేయబడినది.


స్తూపం నిర్మాణంలో ముఖ్యమైన అంశాలు - ఒక వేదిక, దానిపైన అర్ధ గోళాకృతి అండము, అండముపై ఒక హర్మిక, దానిపై నిర్మాణాన్ని అంతటినీ ఆవరించే దండ సహిత ఛత్రము, అండము, హర్మికల మధ్య గళము, చుట్టూరా ఒకటి లేదా రెండు ప్రాకారాలు. మహాచైత్య గర్భంలోనూ, ఇతర భాగాలలోనూ పవిత్ర ధాతువులున్న పది మంజూషికలు లభించాయి. ఆచార్య నాగార్జునుడు ఇక్కడి విహారంలో నివసించి ప్రజ్ఞాపారమిత సూత్రాలను స్థానిక నాగరాజు నుండి గ్రహించి గ్రంథస్థం చేసినట్లు తెలుస్తోంది. తర్కపండితుడు భావవివేకుడు విహారంలో కొంతకాలం ఉండి రచనలు చేశాడు. క్రీ. శ. 684లో హుయాన్ త్సాంగ్ 'అభిధమ్మ పిటకం' అభ్యసించి రచనలు చేశాడు. అనేక సంఘారామాలున్నట్లు, వాటిలో జనావాసం చాలవరకు తగ్గినట్లు, అవి శిధిలావస్థలో ఉన్నట్లు పేర్కొన్నాడు. క్రీ.శ. 1344 వరకు పూజాపునస్కారాలు జరిగినట్లు ఆధారాలున్నాయి. క్రీ.శ. 1700 నాటికి స్తూపము శిధిలావస్థకు చేరుకొంది. మరుగునపడిన చైత్యప్రాశస్త్యం తిరిగి 18వ శతాబ్దములో వెలుగు చూసింది. "దీపాలదిన్నె" గా పిలువబడిన పెద్ద దిబ్బను త్రవ్వి 1797 లో మహాస్తూపాన్ని వెలుగులోకి తెచ్చిన వ్యక్తి కల్నల్ కోలిన్ మెకంజీ.


ఆమరావతి శిల్పము ఆంధ్రభూమిని కళామయము చేసి ఆంధ్రులకు కీర్తి ప్రతిష్టలు ఆపాదించినది. అమరావతి ద్వారా ఆంధ్ర శిల్పి నైపుణ్యం దేశ దేశాలలో వ్యాపించింది. అమరావతీ శిల్పరీతియే ఆంధ్రరీతియై పల్లవ చాళుక్యాది దాక్షిణాత్య శిల్పులకు వరవడియై మలయా, జావా, సుమత్రా, సింహళాది దేశాలలో తన వైజయంతికలను ప్రసరింపజేసిందట. అమరావతి శిల్ప కళారీతి శ్రీలంక, ఆగ్నేయాసియాలలోని విర్మాణాలపై గణనీయమైన ప్రభావం కలిగి ఉంది. ఇక్కడినుండి శిల్పాలు ఆయా దేశాలకు తీసికొని వెళ్ళడం ఇందుకు ఒక కారణం.

... పూర్తి వ్యాసం